Rakshitha is making a comeback of sorts to films, which will also see her team up for the first time with husband Prem as a director.
కన్నడ భామ రక్షిత టాలీవుడ్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. పూరి జగన్నాథ్ రూపొందించిన ఇడియెట్లో రవితేజ, శివమణి చిత్రంలో నాగార్జునతో, చిరంజీవి, మహేష్బాబుతో నటించి అగ్రతారగా మారారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు మొదలెపెట్టారు. కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె కెరీర్లో ఉన్నత స్థానంలో ఉన్న సమయంలోనే సినిమా నుంచి నిష్క్రమించి వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. కన్నడ దర్శకుడు ప్రేమ్తో అఫైర్ కొనసాగించి ఆయనను పెళ్లి చేసుకొన్నారు. తాజాగా మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు రక్షిత. కానీ నటన రూపంలో కాకుండా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తన భర్త రూపొందించిన విలన్ చిత్రంలో హీరోయిన్ అమీ జాక్సన్కు డబ్బింగ్ చెబుతున్నారు. అమీ జాక్సన్ పోషించిన పాత్రకు చెప్పే డబ్బింగ్కు కనుక మంచి ఆదరణ లభిస్తే అదే కొనసాగించాలనుకొంటున్నట్టు కన్నడ వర్గాల సమాచారం. కొద్దిరోజులుగా అమీ జాక్సన్కు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే విధంగా రక్షితను భర్త ప్రేమ్ ప్రోత్సాహిస్తున్నారట.