గాలి ఫ్యామిలీకే దక్కిన MLC టిక్కెట్

  • 6 years ago
It is said that TDP leader late Gali Muddu Krishnama Naidu's wife has got mlc ticket from TDP high command.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆయన సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఇందుకోసం రెండు రోజుల క్రితమే షెడ్యూల్‌ విడుదలైంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఆరు స్థానాలకు అదే రోజున ఎన్నికలు జరుగనున్నాయి. చంద్రబాబును శనివారం ఉదయం గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలిశారు. కాగా, గాలి మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.
#Gali muddu krishnama naidu
#MLC
#TDP
#Chandrababu naidu
#Chittoor
#Andhrapradesh

Category

🗞
News

Recommended