విధ్వంస రాజకీయాలు చేయను, చిరుతో సంబంధంలేదు,

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan talks about brother Chiranjeevi.

కరీంనగర్ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాయాత్రపై ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇక్కడి ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నాయకులతో భేటీ ఏర్పాటు చేసి, అవగాహన రావాల్సి ఉందన్నారు. రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశం అవుతానని చెప్పారు. తెలంగాణ సమస్యలపై తమ బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సూచనలు చేస్తానని చెప్పారు. సమస్యలపై తెలంగాణలోని అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో కరువు యాత్ర చేపడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పలు సున్నితమైన అంశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదని చెప్పారు. తాను అలా చూడనని చెప్పారు.
తమ పార్టీతో కలిసి పని చేయాలనుకునే వారి సలహాలను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను విధ్వంసకర రాజకీయాలు చేయనని చెప్పారు. నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తానని చెప్పారు. ప్రతి సమస్యపై రాజకీయ కోణంలో కాకుండా, పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అభిప్రాయపడ్డారు.

Category

🗞
News

Recommended