‘జై సింహ’ బాలయ్య సీన్.... మహీంద్రా కంపెనీ చైర్మన్ ఫన్నీ కామెంట్ !

  • 6 years ago
"Haha. Now all our service workshops won’t need any hydraulic lifts anymore to do Bolero check-ups!!" Anand Mahindra tweeted.

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'జై సింహ' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంతృప్తికరంగా ఫలితాలు సాధిస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ సీన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘జై సింహ' చిత్రంలో ఓ సీన్లో పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ తో బాలయ్య వాగ్వాదానికి దిగుతాడు. ఈక్రమంలో తన పవర్ చూపించడానికి ఒంటిచేత్తో బొలెరో కారు పైకి ఎత్తే సీన్ ఒకటి ఉంది. ఇపుడు ఈ సీన్ హాట్ టాపిక్ అయింది. బాలయ్యకు మాత్రమే ఇలాంటి సీన్లు సూట్ అవుతాయని అంటున్నారు.
మహిద్రా బొలెరో కారును బాలయ్య ఒంటిచేత్తో పైకి లేపే సన్నివేశంపై మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు'' అని ట్వీట్ చేశారు.
బోలెరో సీన్ కావడంతో.... ఈ విషయాన్ని కొందురు నెటిజన్లు ఆనంద్ మహింద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా సరదాగా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహింద్రా కామెంట్స్‌తో ‘జై సింహ' సినిమా గురించి, బాలకృష్ణ గురించి ఇతర రాష్ట్రాల్లోనూ మార్మోగి పోతోంది.